తెలంగాణలో తాజాగా 739 కరోనా కేసులు
- గత 24 గంటల్లో 32,808 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 377 మందికి పాజిటివ్
- కరోనా నుంచి కోలుకున్న 662 మంది
- ఇంకా 4,686 మందికి చికిత్స
తెలంగాణలో ఇప్పటివరకు 8,13,120 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,04,323 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,686 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 4,111 మంది కరోనాతో మృతి చెందారు.
