తెలంగాణలో కొత్తగా 448 మందికి కొవిడ్ పాజిటివ్

Telangana covid report
  • గత 24 గంటల్లో 22,601 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 272 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 462 మంది
  • ఇంకా 5,166 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 22,601 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా, 448 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో 272 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 37, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 28 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 462 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరణాలేవీ సంభవించలేదు. 

తెలంగాణలో ఇప్పటిదాకా 8,06,572 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,97,295 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,166 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.
Go Back to Shorts
Telangana
COVID19
Media Report
New Cases
Update

More Telugu News