Alluri Sitarama Raju Dist: అల్లూరి సీతారామరాజు జిల్లాలో బస్సుకు నిప్పు పెట్టిన మావోయిస్టులు

  • చింతూరు మండలం కొత్తూరు వద్ద ఘటన
  • ఒడిశా నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న బస్సు
  • ప్రయాణికులను కిందికి దింపి బస్సుకు నిప్పు పెట్టిన వైనం
Maoists Set Fire to Odisha Hyderabad Bus

అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. చింతూరు మండలం కొత్తూరు వద్ద గత రాత్రి ఓ బస్సుకు నిప్పు పెట్టారు. ఒడిశా నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సును ఆపిన మావోలు.. ప్రయాణికులను కిందికి దింపారు. అనంతరం బస్సుకు నిప్పు పెట్టారు. దండకారణ్యం బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో వారు ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.  

బస్సుకు నిప్పు పెట్టడం అది పూర్తిగా కాలి బూడిదైంది. ఈ ఘటనతో జాతీయ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

More Telugu News