Telangana: తెలంగాణలో కొత్తగా 102 మందికి కరోనా

Telangana corona report
  • గత 24 గంటల్లో 25,449 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 35 మందికి పాజిటివ్
  • కరోనా నుంచి కోలుకున్న 287 మంది
  • ఇంకా 1,525 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 25,449 కరోనా పరీక్షలు నిర్వహించగా, 102 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాదులో 35 కొత్త కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 287 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,89,860 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,84,224 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,525 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.
.
Telangana
Corona Virus
Daily Report
Today Cases

More Telugu News