Allu Arjun: 'నాకేం సంబంధం లేదు'.. 'ఆహా' గురించి షాకింగ్ ట్వీట్ చేసిన అల్లు శిరీష్

  • ఆహా ఓటీటీ గురించి శిరీష్ స్పంద‌న‌
  • అందులో స‌మ‌స్య‌లు వ‌స్తే త‌న‌కు ట్వీట్ చేయకూడ‌ద‌ని రిక్వెస్ట్
  • కుటుంబంలో విభేదాలా? అంటూ నెటిజ‌న్ల ట్వీట్లు
shirish on aha

ఓటీటీ ప్లాట్‌ఫాం 'ఆహా' ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్‌ సారథ్యంలో నడుస్తున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న కుమారుడు అల్లు అర్జున్ ఈ ప్లాట్‌ఫాంకు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉన్నాడు. అయితే, 'ఆహా'కు, త‌న‌కు ఎలాంటి సంబంధం లేదంటూ సినీ హీరో అల్లు శిరీష్ చేసిన ట్వీట్ మాత్రం అభిమానుల్లో చ‌ర్చ‌కు దారితీసింది.

'ఆహా' సబ్‌ స్క్రైబర్లు ఆ యాప్‌లో ఏమైనా సమస్యలు వ‌స్తే ట్వీట్లు చేస్తున్నారు. తాను ఆ యాప్‌లో సాంకేతిక‌ సమస్యలను ఎదుర్కొంటున్నామ‌ని చెబుతూ ఓ వ్య‌క్తి తాజాగా ట్వీట్ చేశాడు. ఈ స‌మ‌స్య‌ల‌ను వెంటనే పరిష్కరించాల్సిందిగా కోరుతూ ఆహా వీడియోస్‌ టీం, అల్లు అర్జున్, అల్లు శిరీష్‌లను అతను ట్యాగ్ చేశాడు.

దీంతో ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేసిన శిరీష్ అసహనం వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. చాలా మంది ఆహాలో ఏదైనా స‌మ‌స్య‌ వస్తే సోషల్ మీడియాలో త‌న‌ను ట్యాగ్ చేస్తున్నారని, చాలా మంది తాను ఆహా బిజినెస్‌లో ఇన్వాల్వ్ అయ్యానని అనుకుంటున్నారని పేర్కొన్నాడు. వినియోగ‌దారుల‌కు సంబంధించిన‌ ఇటువంటి స‌మ‌స్య‌ల‌ను 'ఆహా' టీం ప‌రిష్క‌రించాలంటూ శిరీష్ ట్వీట్ చేశాడు.

దీంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. అల్లు అర్జున్ అభిమానులైతే హ‌ర్ట్ అవుతూ పోస్టులు చేస్తున్నారు. అల్లు అర్జున్ త‌మ్ముడే అయ్యుండి, ఆహాతో ఎటువంటి సంబంధం లేదంటూ ఇటువంటి ట్వీట్ ఎందుకు చేశావ‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

ఆహాకు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా అల్లు అర్జున్ ఉంటే శిరీష్ మాత్రం దానికి ఎందుకు దూరంగా ఉంటున్నాడ‌ని కామెంట్లు చేస్తున్నారు. త‌న‌కు, ఆహాకు ఎలాంటి సంబంధ‌మూ లేద‌న్నట్లు శిరీష్ చేసిన ట్వీట్ తో ఆ కుటుంబంలో విభేదాలు ఉన్నాయా? అనే అనేక అనుమానాల‌ను నెటిజ‌న్లు వ్య‌క్తం చేస్తున్నారు.

More Telugu News