Telangana: తెలంగాణలో కరోనా రోజువారీ కేసుల పూర్తి వివరాలు ఇవిగో!

  • గత 24 గంటల్లో 38,023 కరోనా పరీక్షలు
  • 235 మందికి పాజిటివ్
  • జీహెచ్ఎంసీ పరిధిలో 121 కొత్త కేసులు
  • ఇంకా 3,490 మందికి చికిత్స
Telangana corona report

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 38,023 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 235 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 121 కొత్త కేసులు వెల్లడయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 31, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 23 కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 204 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,81,307 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,73,793 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,490 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,024 అని తాజా బులెటిన్ లో పేర్కొన్నారు.

More Telugu News