Telangana: తెలంగాణ కరోనా రోజువారీ కేసుల వివరాలు ఇవిగో!

  • రాష్ట్రంలో తాజాగా 35,037 కరోనా పరీక్షలు
  • 162 మందికి పాజిటివ్
  • జీహెచ్ఎంసీ పరిధిలో 81 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 3,547 మందికి చికిత్స
Telangana state covid bulletin

తెలంగాణలో 24 గంటల వ్యవధిలో 35,037 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 162 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 81 కొత్త కేసులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లాలో 24, హనుమకొండ జిల్లాలో 10 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 210 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 6,80,413 పాజిటివ్ కేసులు నమోదు కాగా.... 6,72,847 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,547 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,019కి పెరిగింది.

More Telugu News