Telangana: తెలంగాణలో మరో 181 మందికి కరోనా

  • గత 24 గంటల్లో 39,781 కరోనా పరీక్షలు
  • గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 84 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 3,782 మందికి చికిత్స
Telangana corona daily report

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 39,781 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 181 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాదులో అత్యధికంగా 84 కొత్త కేసులు వెల్లడయ్యాయి. హనుమకొండ జిల్లాలో 14, రంగారెడ్డి జిల్లాలో 13 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 203 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,79,245 పాజిటివ్ కేసులు నమోదు కాగా.... 6,71,450 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,782 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించినవారి సంఖ్య 4,013కి పెరిగింది.

More Telugu News