తెలంగాణలో కొత్తగా 213 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 39,495 కరోనా టెస్టులు
- జీహెచ్ఎంసీ పరిధిలో 72 కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 3,779 మందికి చికిత్స
అదే సమయంలో 156 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,76,787 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,69,010 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,779 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,998కి పెరిగింది.
