Telangana: తెలంగాణలో మరో 134 కరోనా కేసుల వెల్లడి

  • గత 24 గంటల్లో 32,621 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 44 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 3,626 మందికి చికిత్స
Telangana corona daily status report

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 32,621 కరోనా పరీక్షలు నిర్వహించగా, 134 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 44 కొత్త కేసులు వెల్లడయ్యాయి. జనగామ, ములుగు, నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.

అదే సమయంలో 164 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,74,452 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,66,846 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,626 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,980కి పెరిగింది.

More Telugu News