Dog: ఈ శునకం వందల కోట్ల ఆస్తికి వారసురాలు!

  • అమెరికాలో కుక్క పేరిట రూ.238 కోట్ల ఆస్తి
  • ఓ వృద్ధురాలి వీలునామా
  • మయామీలో విలువైన భవనం కుక్క సొంతం
  • భవనాన్ని వేలం వేయనున్న లాయర్లు
Dog named Gunther VI owned huge assets

అమెరికాలో గుంథర్-6 అనే పేరున్న శునకం వందల కోట్ల ఆస్తికి వారసురాలు అంటే ఆశ్చర్యం కలగకమానదు. భారత కరెన్సీలో దాదాపు రూ.238 కోట్లు ఆ కుక్కకు వారసత్వ పరంపరలో సంక్రమించాయి. అసలు కథేంటంటే... మయామీ ప్రాంతానికి చెందిన కార్లోట్టా అనే మహిళ గుంథర్-3 అనే శునకాన్ని ఎంతో ముచ్చటపడి పెంచుకుంది. కార్లొట్టా సంపన్నురాలు. ఎంతో విలువైన భవనాన్ని ఆమె గుంథర్-3 పేరున రాసింది.

1928లో నిర్మితమైన ఆ భవనంలో ఏకంగా 9 బెడ్రూంలు ఉన్నాయి. ఓ స్విమ్మింగ్ పూల్ కూడా ఆ భవన ప్రాంగణంలో ఉంది. అంతేకాదు, గుంథర్-3 తదనంతరం దాని వారసులకు ఆస్తి సంక్రమించాలని వీలునామాలో పేర్కొంది. ఆ విధంగా ఆస్తి ఇప్పుడు గుంథర్-6కి దక్కింది. కార్లోట్టా 1992లో మరణించారు. అప్పటి నుంచి గుంథర్ శ్రేణిలోని కుక్కల తరఫున ఆస్తి వ్యవహారాలను ఆమె న్యాయవాదులే చూసుకుంటున్నారు. తాజాగా గుంథర్-6 పేరిట ఉన్న భవంతిని వేలం వేయాలని నిర్ణయించారు.

కాగా గతంలో ఈ భవనాన్ని పాప్ గాయని మడోన్నా కొనుగోలు చేసి, కొన్నాళ్ల తర్వాత అమ్మేశారు. అది పలు చేతులు మారగా, కార్లొట్టా కొనుగోలు చేశారు.

More Telugu News