Telangana: తెలంగాణలో మరో 167 మందికి కరోనా పాజిటివ్

  • గత 24 గంటల్లో 37,283 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 55 కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 3,737 మందికి చికిత్స
Telangana corona media report

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 37,283 కరోనా పరీక్షలు నిర్వహించగా, 167 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 55 కొత్త కేసులు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 14, రంగారెడ్డి జిల్లాలో 12, వరంగల్ అర్బన్ జిల్లాలో 11 కేసులు వెల్లడయ్యాయి. ములుగు, నారాయణపేట, జోగులాంబ గద్వాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.

అదే సమయంలో 164 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,73,889 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,66,176 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,737 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,976కి పెరిగింది.

More Telugu News