Allu Arjun: 'ఐకాన్'కి దసరానే ముహూర్తం!

  • 'ఐకాన్' ప్రాజెక్టుకి సన్నాహాలు
  • పాన్ ఇండియా స్థాయి కథగా మార్పులు  
  • డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ 
  • కథానాయికలుగా పూజ హెగ్డే - కృతి శెట్టి
Icon movie will launch at Dasara

అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప' సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా మారేడుమిల్లి ఫారెస్టులో చివరి షెడ్యూల్ షూటింగు జరుపుకుంటోంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను, 'క్రిస్మస్' కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా తరువాత ఆయన 'ఐకాన్' చేయనున్న సంగతి తెలిసిందే.

'దిల్' రాజు నిర్మాణంలో .. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ ఈ సినిమా స్క్రిప్ట్ కొంతకాలం క్రితమే సిద్ధమైంది. పాన్ ఇండియా స్థాయిలోనే ఈ సినిమా ఉండాలనే బన్నీ నిర్ణయంతో, ఆ స్థాయికి తగినట్టుగా అక్కడక్కడా మార్పులు చేశారు.

ఈ సినిమా పూజా కార్యక్రమాలను విజయదశమి రోజున ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. డిసెంబర్ రెండోవారం నుంచి రెగ్యులర్ షూటింగును మొదలుపెడతారట. ఈ సినిమాలో ప్రధాన కథానాయికగా పూజ హెగ్డే ... రెండో కథానాయికగా కృతి శెట్టి కనిపించనుందని అంటున్నారు.

More Telugu News