Sushil Kumar: రెజ్లర్ సుశీల్ కుమార్ రిమాండును పొడిగించిన ఢిల్లీ కోర్టు

  • యువ రెజ్లర్ సాగర్ హత్యకేసులో సుశీల్ అరెస్ట్
  • ఈ నెల 23న 6 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
  • నేటితో ముగిసిన రిమాండ్
  • సుశీల్ ను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
  • 4 రోజుల పాటు రిమాండ్ పొడిగింపు
Delhi court extends wrestler Sushil Kumar remand for four days

వర్ధమాన రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో అరెస్టయిన రెజ్లర్ సునీల్ కుమార్ రిమాండ్ ను ఢిల్లీ కోర్టు పొడిగించింది. సుశీల్ కుమార్ కు మరో 4 రోజుల పాటు పోలీస్ కస్టడీ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ హత్యకేసులో సుశీల్ తో పాటు అరెస్టయిన అజయ్ కి కూడా రిమాండ్ పొడిగించింది.

ఈ నెల 23న సుశీల్ కుమార్ కు 6 రోజుల రిమాండ్ విధించగా, అది నేటితో ముగిసింది. దాంతో సుశీల్ కుమార్ ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు 7 రోజుల కస్టడీ కోరగా కోర్టు 4 రోజులకే అనుమతించింది. కరోనా నేపథ్యంలో ప్రతి 24 గంటలకు ఒకసారి సుశీల్ కుమార్ కు మెడికల్ చెకప్ చేయించాలని కోర్టు ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. 4 రోజుల రిమాండ్ సందర్భంగా సుశీల్ కుమార్ ను ఆయన తరఫు న్యాయవాది కలవొచ్చని పేర్కొంది.

More Telugu News