arrest: కొవిడ్​ మృత‌దేహాన్ని పీక్కుతింటోన్న వ్య‌క్తిని గుర్తించి పోలీసుల‌కు స‌మాచారం అందించిన స్థానికులు!

  • మ‌హ‌రాష్ట్రలో ఘ‌ట‌న‌
  • శ్మ‌శానంలో అంత్య‌క్రియ‌లు చేసి వెళ్లిన సిబ్బంది
  • అనంతరం మృత‌దేహం వద్ద‌కు వ‌చ్చిన వ్య‌క్తి
  • అత‌డి చేష్ట‌ల‌ను వీడియో తీసిన స్థానికులు
  • మ‌తిస్థిమితం లేక చేశాడ‌ని అంటోన్న పోలీసులు
man arrested for eating dead body

కొవిడ్ మృత‌దేహాన్ని పీక్కుతింటున్నాడు ఓ వ్య‌క్తి. క‌రోనా అంటేనే ప్ర‌జ‌లు భ‌య‌ప‌డిపోతోంటే, కొవిడ్‌తో మృతి చెందిన‌ కుటుంబస‌భ్యుల మృత‌దేహాల‌ను ముట్టుకోవ‌డానికి కూడా భ‌య‌ప‌డిపోతుంటే ఓ వ్య‌క్తి మాత్రం అటువంటి శ‌వాన్నీ పీక్కుతింటుండ‌డం క‌ల‌క‌లం రేపింది.

ఈ ఘటన మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని ఫల్టాన్ మున్సిపల్ పరిధిలోని ఓ శ్మశానవాటికలో జరిగింది. ఆ దృశ్యాల‌ను కొంద‌రు స్మార్ట్‌ఫోన్ల‌లో తీసి, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. కరోనా మృతదేహాలకు అంత్య‌క్రియ‌లు చేసి సిబ్బంది శ్మ‌శాన వాటిక నుంచి వెళ్లిపోయాక‌ సగం కాలిన కరోనా మృతదేహాల అవయవాలను ఓ వ్యక్తి పీక్కు తింటున్నాడు. అత‌డి చేష్ట‌ల‌ను చూసిన‌ స్థానికులు పోలీసుల‌కు సమాచారం అందించారు. దీంతో ఫల్టాన్ మున్సిపల్ అధికారులు అక్కడకు చేరుకున్నారు.  

వారు శ్మ‌శానానికి వచ్చేలోగా సదరు వ్యక్తి అక్క‌డి నుంచి పారిపోయాడు. అత‌డిని కొన్ని గంట‌ల్లోనే అధికారులు గాలించి పట్టుకున్నారు. అత‌డికి మతిస్థిమితం సరిగా లేదని తెలుసుకున్నారు. అత‌డిని చికిత్స కోసం ఆసుప‌త్రికి తరలించామ‌ని,  వైద్య నివేదికలు వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.

More Telugu News