Delhi Capitals: ఐపీఎల్ లో మరో ఆసక్తికర పోరు... బెంగళూరుపై టాస్ గెలిచిన ఢిల్లీ

  • నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్
  • బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ జట్టు
  • మొదట బ్యాటింగ్ చేయనున్న బెంగళూరు
  • పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో ఉన్న ఇరు జట్లు
Delhi Capitals won the toss against RCB

ఓవైపు కరోనా కల్లోలం కొనసాగుతున్న తరుణంలోనూ క్రీడా వినోదం పంచుతూ ఐపీఎల్ 14వ సీజన్ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో, నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఆసక్తికరపోరు జరగనుంది. ఈ మ్యాచ్ కు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఈ పోరులో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది.

ఈ రెండు జట్లు చెరో 5 మ్యాచ్ లు ఆడి నాలుగేసి విజయాలు సాధించాయి. పాయింట్ల పట్టికలో ఢిల్లీ రెండో స్థానంలో, బెంగళూరు మూడో స్థానంలో ఉన్నాయి. వరుసగా నాలుగు విజయాలు సాధించిన బెంగళూరు... ఇటీవల చెన్నై చేతిలో ఓటమిపాలవడంతో పాయింట్ల పట్టికలో సమీకరణాలు మారిపోయాయి. చెన్నై టాప్ లోకి వెళ్లగా, బెంగళూరు కిందికిపడిపోయింది.

ఇక, నేటి మ్యాచ్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఒక మార్పు జరిగింది. కరోనా బారిన పడిన తన కుటుంబ సభ్యుల కోసం ఐపీఎల్ ను వీడిన రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో ఇషాంత్ శర్మ జట్టులోకి వచ్చాడు. బెంగళూరు జట్టులో రజత్ పాటిదార్, డానియల్ శామ్స్ కు స్థానం కల్పించారు. నవదీప్ సైనీ, డాన్ క్రిస్టియన్ లను జట్టు నుంచి తప్పించారు.

More Telugu News