శ్రీలంకపై ఐరాస మానవ హక్కుల మండలిలో ఓటింగ్... భారత్ గైర్హాజరు 

India avoided UNHRC voting on Sri Lanka rights record
శ్రీలంకలో మానవ హక్కుల పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (యూఎన్ హెచ్చార్సీ)లో ఇవాళ తీర్మానం ప్రవేశపెట్టి ఓటింగ్ నిర్వహించారు. అయితే ఈ ఓటింగ్ కు భారత్ గైర్హాజరైంది. భారత్ కాకుండా మరో 13 దేశాలు కూడా ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. శ్రీలంకలో గతంలో తమిళులపై జరిగిన యుద్ధ నేరాల నేపథ్యంలో ఈ తీర్మానం తీసుకువచ్చారు.

ఐరాస మానవ హక్కుల కమిషనర్ కార్యాలయం జనవరి 27న సమర్పించిన నివేదికను పరిగణనలోకి తీసుకుని ఈ తీర్మానానికి రూపకల్పన చేశారు. శ్రీలంకలో బాధ్యతాయుత ధోరణి పునరుద్ధరణ, మానవ హక్కుల స్థాపన పేరిట ఈ తీర్మానాన్ని యూఎన్ హెచ్చార్సీలో ప్రవేశపెట్టారు. 47 సభ్యదేశాల్లో 22 దేశాలు ఈ తీర్మానానికి మద్దతుగా ఓటేశాయి. 11 సభ్య దేశాలు వ్యతిరేకంగా ఓటేశాయి.

అయితే ఈ తీర్మానం అన్యాయం అని శ్రీలంక ఆక్రోశించింది. ఐరాస రాజ్యాంగానికి ఇది వ్యతిరేకం అని ఆరోపించింది. కాగా, ఇదే అంశంలో శ్రీలంకకు 2012-2014 మధ్య కాలంలో ఐరాస మానవ హక్కుల మండలిలో మూడుసార్లు ప్రతికూల ఫలితం వచ్చింది.
Go Back to Shorts
Sri Lanka
UNHRC
India
Voting
Human Rights

More Telugu News