Corona Virus: నవంబర్ తరువాత... ఇండియాలో భారీగా పెరిగిన కరోనా యాక్టివ్ కేసులు!

  • ఒక్కసారిగా పెరిగిన యాక్టివ్ కేసుల సంఖ్య
  • 2.9 శాతంగా కొత్త కేసుల పెరుగుదల
  • మహారాష్ట్ర, కేరళలో అత్యధికం
  • ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
Corona Active Cases Rise in India

ఇండియాలో కరోనా రెండో దశ ఉద్ధృతంగా ఉందన్న సంకేతాలకు మరింత ఊతమిస్తూ, గత సంవత్సరం నవంబర్ తరువాత, యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య తొలిసారిగా భారీగా పెరగడంతో పాటు, 17 రోజుల తరువాత మరోసారి యాక్టివ్ కేసుల సంఖ్య లక్షన్నరను దాటింది. గడచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా, 4,421 కేసులు వచ్చాయి. నవంబర్ నెలలో 24వ తేదీన 4,38,667 యాక్టివ్ కేసులు ఉండగా, ఆ సంఖ్య మూడు రోజుల్లో 3.85 శాతం పెరిగి 4.55 లక్షలను దాటాయి.

ఆపై తిరిగి నిన్న ఆ స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. వరుసగా ఐదవ రోజు కూడా యాక్టివ్ కేసుల సంఖ్య పెరిగింది. గత వారంలో 1.5 శాతం ఉన్న ఈ పెరుగుదల, ఇప్పుడు 2.9 శాతాన్ని దాటింది. ఇక రోజువారీ కొత్త కేసుల సంఖ్య విషయంలోనూ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నెల 16న 9,121గా ఉన్న రోజువారీ కొత్త కేసుల సంఖ్య, ఏడు రోజుల సగటును దాటి 13.8 శాతం పెరిగి సోమవారం నాడు 14,199కి పెరిగాయి.

ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ లలో రోజువారీ కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఐదు రాష్ట్రాల్లోనూ ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. కొత్త కేసుల్లో న్యూ స్ట్రెయిన్ అధికంగా కనిపిస్తుండటంతో, దాని వ్యాప్తి గొలుసును విడగొట్టేందుకు వైద్యాధికారులు, స్థానిక అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న మొత్తం యాక్టివ్ కేసుల్లో 74 శాతం కేసులు కేరళ, మహారాష్ట్రలోనే ఉండటం గమనార్హం. ఇక కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్, జమ్ము కశ్మీర్ రాష్ట్రాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి.

More Telugu News