అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు జమ చేసి అండగా నిలిచామని వెల్లడి
- ప్రకృతి వ్యవసాయంతో భూమిని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపు
- ప్రభుత్వ సలహాలు పాటిస్తూ రైతులు సిరులు పండించాలని ఆకాంక్ష
దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలని చంద్రబాబు పేర్కొన్నారు. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు రైతులు భూమిని, పశుసంపదను పూజించి ప్రకృతితో అనుసంధానమయ్యే విశిష్టమైన పండుగ ఏరువాక అని ఆయన వివరించారు. పాడిపంటలతో రైతుల ఇళ్లలో వెలుగులు నిండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
రైతు సంక్షేమమే ధ్యేయంగా ‘అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్’ నిధులు జమ చేసి రైతులకు అండగా నిలిచామని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఎల్ నినో, అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా తలెత్తే సవాళ్లను రైతులు ధైర్యంగా అధిగమించాలని సూచించారు. ప్రకృతి సాగుతో పంటలు పండించి, మన భూమిని మరియు ఆరోగ్యాన్ని విషతుల్యం కాకుండా కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సూచనలు, సలహాలు పాటిస్తూ రైతన్నలు సాగులో సిరులు పండించాలని చంద్రబాబు ఆకాంక్షించారు.