Corona Virus: తెలంగాణ‌లో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌!

  • కొత్త‌గా 157 కరోనా కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,97,435  
  • మృతుల సంఖ్య 1,623
  • జీహెచ్ఎంసీలో కొత్త‌గా 27 క‌రోనా కేసులు  
Media Bulletin on status of positive cases COVID19 in Telangana

తెలంగాణలో కొత్త‌గా 157 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో
కొత్త మ‌ర‌ణాలు న‌మోదు కాలేదు. అదే సమయంలో 157 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,97,435 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,94,097  మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,623 గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,715 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 649 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్త‌గా 27 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.
 

More Telugu News