Corona Virus: తెలంగాణలో కొత్త‌గా 129 మందికి కరోనా నిర్ధార‌ణ‌

  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,96,802
  • కోలుకున్న వారు 2,93,540 మంది
  • మృతుల సంఖ్య 1,619  
  • జీహెచ్ఎంసీలో కొత్త‌గా 23 క‌రోనా కేసులు  
Media Bulletin on status of positive cases COVID19 in Telangana

తెలంగాణలో కొత్త‌గా 129 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఒక‌రు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 161 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,96,802కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,93,540 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,619 గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,643 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 637 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్త‌గా 23 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.
  

More Telugu News