Andhra Pradesh: ఏపీలో గత 24 గంటల్లో 54 కరోనా పాజిటివ్ కేసులు

  • భారీగా తగ్గిపోయిన కొత్త కేసులు
  • విశాఖ జిల్లాలో కొత్తగా 9 కేసులు
  • పలు జిల్లాల్లో కొత్త కేసులు నిల్
  • 71 మందికి కరోనా నయం
  • ఇంకా 797 మందికి చికిత్స
Fifty four new corona positive cases in AP

రాష్ట్రంలో కరోనా విజృంభణ మరింత నెమ్మదించింది. గడచిన 24 గంటల్లో 33,415 నమూనాలు పరీక్షించగా 54 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా విశాఖ జిల్లాలో 9 కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 8, తూర్పు గోదావరి జిల్లాలో 7 కేసులు గుర్తించారు. అనంతపురం, విజయనగరం, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 71 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఒక్క మరణం కూడా సంభవించలేదు. ఏపీలో ఇప్పటిదాకా 8,88,814 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,80,855 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య మరింత తగ్గి 797కి చేరింది. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 7,162గా నమోదైంది.

More Telugu News