Corona Virus: తెలంగాణలో క‌రోనా కేసుల తాజా వివ‌రాలు!

  • కొత్త‌గా 34,805 క‌రోనా ప‌రీక్ష‌లు
  • 150 మందికి కరోనా నిర్ధార‌ణ
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,581
  • మృతుల సంఖ్య 1,610  
 Media Bulletin on status of positive cases COVID19 in Telangana

తెలంగాణలో గత 24 గంటల్లో 34,805 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 150 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 186 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,581 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం  2,92,032 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,610 కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 1,939 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 808 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 25 కరోనా కేసులు నమోదయ్యాయి.
  

More Telugu News