కడకు తలొంచక తప్పలేదు: నిమ్మగడ్డ పునర్నియామకంపై సోమిరెడ్డి
- ఎస్ఈసీ విషయంలో కోర్టుల తీర్పులు ధిక్కరించారు
- జగన్ సలహాదారులెవరోకానీ వారికి కనీస జ్ఞానం కరవైనట్టుంది
- కోర్టులతో మొట్టికాయలు తిన్నారు
- వితండవాది అని దేశమంతా పేరుతెచ్చుకుంటున్నారు
'ఎస్ఈసీ విషయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అనేకసార్లు హైకోర్టు, సుప్రీంకోర్టుల మెట్లెక్కి వారి తీర్పులు ధిక్కరించినా కడకు తలొంచక తప్పలేదు. నిమ్మగడ్డ రమేశ్ గారి పునర్నియామకం విషయంలో ప్రభుత్వ తీరు తప్పని సామాన్య మానవుడు కూడా అభిప్రాయం వ్యక్తం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం లెక్కచేయలేదు.
'ఆయన సలహాదారులెవరోకానీ వారికి కనీస జ్ఞానం కరవైనట్టుంది. కోర్టులతో మొట్టికాయలు తినడంతో పాటు వితండవాది అని దేశమంతా పేరుతెచ్చుకుంటున్నారు. చివరకు ఏమైంది? ఆ రమేష్ కుమార్ గారినే అదే స్థానంలో కూర్చోబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా సహరాజ్యాంగ వ్యవస్థలను గౌరవిస్తారని ఆశిస్తున్నాం' అని సోమిరెడ్డి చెప్పారు.