LG Polymers: విశాఖ దుర్ఘటనపై దర్యాప్తునకు దక్షిణకొరియా నుంచి ప్రత్యేక బృందం

  • ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తుకు సిద్ధమైన ‘ఎల్జీ’  
  • దక్షిణ కొరియా నుంచి రానున్న ప్రత్యేక బృందం
  • ఈ బృందంలో 8 మంది సభ్యులు
Special team from South Korea to investigate the Visakha incident

విశాఖపట్టణంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీకేజ్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.  ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టేందుకు ‘ఎల్జీ పాలిమర్స్’ కూడా సిద్ధమైంది. ఇందుకోసం దక్షిణకొరియా నుంచి ఓ ప్రత్యేక బృందం భారత్ కు బయలుదేరింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ దక్షిణ కొరియాలోని ఎల్జీ కెమికల్స్ ప్రధాన కార్యాలయం ఓ ప్రకటన చేసింది.

 ఎల్జీ పెట్రో కెమికల్ విభాగం అధినేత నేతృత్వంలో దర్యాప్తు చేపట్టే ఈ ప్రత్యేక బృందంలో  8 మంది సభ్యులు  ఉన్నట్టు తెలిపింది. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో కూడా దక్షిణ కొరియా బృందం భేటీ కానున్నట్టు సమాచారం. పరిశ్రమలో స్టిరీన్ గ్యాస్ లీకేజ్ కు గల కారణాల విశ్లేషణతో పాటు, గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో ప్రజలు తీసుకోవాల్సిన చర్యలను ఈ బృందం వివరించనుంది.

More Telugu News