Chandrababu: ఔరంగాబాద్ రైలు ప్రమాద ఘటనపై ఎంతో బాధపడ్డాను: చంద్రబాబునాయుడు

  • మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి
  • ఈ ఘటనలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలి
  • రైలు ప్రమాద ఘటనపై స్పందిస్తూ చందబ్రాబు ట్వీట్
Chandrababu Naidu tweet about train accident

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ - నాందేడ్ మార్గంలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనపై  టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. ఈ ఘటన సమాచారం తెలిసి తాను ఎంతో బాధపడ్డానని అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని, ఈ ఘటనలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు.  కాగా,  ఈ రైలు ప్రమాదంలో 16 మంది మరణించినట్టు సమాచారం. వీరంతా మధ్యప్రదేశ్ కు చెందిన కార్మికులుగా తెలుస్తోంది.

More Telugu News