Kangana Ranaut: 'తలైవి'లో శోభన్ బాబు పాత్ర నిడివిపై సందేహాలు

  • కంగనా రనౌత్ ప్రధాన పాత్రధారిగా 'తలైవి'
  • కొంతవరకూ పూర్తయిన చిత్రీకరణ
  • శోభన్ బాబు పాత్రలో జిషు సేన్ గుప్తా
Thalaivi Movie

దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితచరిత్ర ఆధారంగా 'తలైవి' సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. జయలలిత సినీ .. రాజకీయ జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ఈ బయోపిక్ లో ప్రస్తావించనున్నారు. కంగనా రనౌత్ ప్రధానమైన పాత్రను పోషిస్తున్న ఈ సినిమాలో, కరుణానిధిగా ప్రకాశ్ రాజ్ ..  ఎంజీ రామచంద్రన్ గా అరవింద్ స్వామి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

జయలలితతో సన్నిహిత సంబంధాన్ని కలిగిన వ్యక్తిగా శోభన్ బాబు కనిపిస్తారు. అందువలన ఈ సినిమాలో ఆయన పాత్ర కూడా వుంది. ఈ పాత్ర కోసం జిషు సేన్ గుప్తాను తీసుకున్నారు. అయితే జయలలిత అభిమానుల మనోభావాలు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో, శోభన్ బాబు పాత్ర నిడివిని తగ్గించాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ విషయంపైనే కోలీవుడ్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జయలలిత జీవితంలో ఆయన పాత్రను ఎంతవరకూ చూపిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

More Telugu News