Sharwanand: 'శ్రీకారం' వాయిదాపడే అవకాశం?

  • శర్వానంద్ హీరోగా 'శ్రీకారం'
  • దర్శకుడిగా కిషోర్ రెడ్డి 
  •  కథానాయికగా ప్రియాంక అరుళ్ మోహన్  
SreeKaram Movie

మొదటి నుంచి కూడా శర్వానంద్ వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ వస్తున్నాడు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే కథలను ఎంచుకుంటూ వస్తున్నాడు. ఈ కారణంగానే శర్వానంద్ సినిమాలో కంటెంట్ బాగుంటుందనే నమ్మకంతో ఆడియన్స్ థియేటర్స్ కి వెళుతుంటారు. అయితే కొంతకాలంగా ఆయన సినిమాలు ఆశించినస్థాయిని అందుకోలేకపోతున్నాయి.

ఆయన తాజా చిత్రంగా 'శ్రీకారం' రూపొందింది. కిషోర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏప్రిల్ 24వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే కరోనా కారణంగా ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేయాలనే ఆలోచనలో నిర్మాతలు వున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకుముందు శర్వానంద్ చేసిన సినిమాల పరాజయం ప్రభావం ఈ సినిమా బిజినెస్ పై పడకుండా వాళ్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఈ సినిమాలో శర్వానంద్ జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ కనిపించనుంది.

More Telugu News