‘మూన్వాక్’ తర్వాత రోడ్లపై గుంతలు పూడ్చిన బెంగళూరు అధికారులు
- రోడ్లపై గుంతలకు నిరసనగా ఆర్టిస్ట్ ‘మూన్వాక్’
- 24 గంటల్లోనే గుంతలు పూడ్చిన అధికారులు
- థ్యాంక్స్ చెప్పిన ఆర్టిస్ట్ నంజుండస్వామి
సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. పదిలక్షల మందికిపైగా దీనిని వీక్షించారు. చివరికి ఇది బెంగళూరు మునిసిపల్ అధికారుల దృష్టికి చేరడంతో వారు యుద్ధ ప్రాతిపదికన రోడ్లపై గుంతలు పూడ్చివేసే కార్యక్రమం చేపట్టారు. బెంగళూరు అధికారుల స్పందనకు నంజుండస్వామి కృతజ్ఞతలు తెలిపాడు. వేగంగా స్పందించి రోడ్లపై గుంతలు పూడ్చినందుకు బెంగళూరు మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనిల్ కుమార్, మేయర్ ప్రభాకర్, సిబ్బందికి థ్యాంక్స్ చెప్పాడు.