జమ్మూకశ్మీర్ లో భీకర ఎన్ కౌంటర్.. ఓ ఉగ్రవాది కాల్చివేత!
- ఉగ్రకాల్పుల్లో పోలీస్ అధికారి వీరమరణం
- నిఘా సమాచారంతో గాలింపు చేపట్టిన బలగాలు
- భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం
అయితే బలగాల కదలికలను పసిగట్టిన ఉగ్రమూకలు కాల్పులు జరుపుతూ పరారయ్యేందుకు ప్రయత్నించాయి. దీంతో భద్రతాబలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. నిన్న సాయంత్రం ప్రారంభమైన ఈ ఎన్ కౌంటర్ ఈరోజు ఉదయం వరకూ కొనసాగింది. చివరికి ఓ ఉగ్రవాది మృతదేహాన్ని భద్రతాబలగాలు కనుగొన్నాయి.
మరోవైపు ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ ప్రత్యేక పోలీస్ అధికారి(ఎస్ పీవో) బిల్లాల్ అమరుడయ్యారు. ఎస్ఐ అమర్ దీప్ సింగ్ తీవ్రంగా గాయపడగా, ఆయన్ను భద్రతాబలగాలు ఆసుపత్రికి తరలించాయి. ఘటనాస్థలి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఎన్ కౌంటర్ నుంచి ఉగ్రవాదులు ఎవరైనా తప్పించుకుని ఉండొచ్చన్న ఉద్దేశంతో గాలింపును కొనసాగిస్తున్నాయి.