'దొరసాని' టెన్షన్ తగ్గిందట!
- నాయకా నాయికల తొలి పరిచయం
- 'గడీ' నేపథ్యంలో సాగే ప్రేమకథ
- వచ్చేనెల 12వ తేదీన విడుదల
ఈ సినిమాను వచ్చేనెల 12వ తేదీన విడుదల చేయనున్నారు. అదే రోజున 'ఇస్మార్ట్ శంకర్' ఉండటంతో, 'దొరసాని' టీమ్ టెన్షన్ పడింది. ఎందుకంటే పూరి - రామ్ కాంబినేషన్ కి గల క్రేజ్ వేరు. అయితే తాజాగా ఈ సినిమా వచ్చేనెల 18వ తేదీకి విడుదలను వాయిదా వేసుకుంది. దాంతో 'దొరసాని' టీమ్ హ్యాపీగా ఫీలవుతోందని సమాచారం. 'దొరసాని' రోజునే సందీప్ కిషన్ 'నిను వీడని నీడను నేనే' ఉన్నప్పటికీ దాని జోనర్ వేరు.