pandula ravindra babu: వైసీపీలో చేరి.. మళ్లీ టీడీపీ వైపు చూస్తున్న అమలాపురం ఎంపీ
టీడీపీని వీడి వైసీపీలో చేరిన నేతల్లో కొందరు మళ్లీ సొంత గూటికి చేరుకునేందుకు యత్నిస్తున్నట్టు తెలుస్తోంది. నెల రోజుల క్రితం టీడీపీకి గుడ్ బై చెప్పి, జగన్ సమక్షంలో వైసీపీలో చేరి, సంచలనాలకు తెరలేపిన అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు... తన మనసు మార్చుకున్నట్టు సమాచారం. వైసీపీలో తాను కోరుకున్న సీటు దక్కకపోవడంతో... మళ్లీ టీడీపీలోకి వస్తానంటూ ఆ పార్టీ పెద్దలతో చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో, ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు ఆయనతో టచ్ లోకి వచ్చినట్టు సమాచారం.