622 పరుగుల స్కోరు వద్ద డిక్లేర్ చేసిన భారత్!
- 81 పరుగులు చేసి అవుట్ అయిన జడేజా
- క్రీజ్ లో నాటౌట్ గా 159 పరుగులతో నిలిచిన పంత్
- చివర్లో ఉరుకులు, పరుగులు పెట్టిన స్కోర్
దీంతో స్కోర్ చూస్తుండగానే 600 పరుగులు దాటేసింది. ఆపై జడేజా సెంచరీ చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నట్టు కనిపించగా, అతను అవుట్ కావడంతో, వెంటనే డిక్లేర్ చేశారు. ఈ ఇన్నింగ్స్ లో భారత్ 7 వికెట్లను కోల్పోగా, నిరాశపరిచింది ఒక్క కేఎల్ రాహుల్ మాత్రమే. మయాంక్ అగర్వాల్ 77, పుజారా 193, కోహ్లీ 23, రహానే 18, హనుమ విహారి 42, రిషబ్ పంత్ 159, జడేజా 81 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో లియాన్ కు 4 వికెట్లు దక్కగా, హాజిల్ వుడ్ 2, స్టార్క్ 1 వికెట్ పడగొట్టారు. మరికాసేపట్లో ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించనుంది. ఈ మ్యాచ్ లో వికెట్ కీపర్ గా వచ్చి, ఓ టెస్ట్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాలో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాడిగా రిషబ్ పంత్ నిలిచాడు.