నేను ప్రధాన పాత్రలో నటించిన చిత్రాలేవీ విడుదలకు నోచుకోవట్లేదు: గోవింద ఆవేదన
- 20 సన్నివేశాలను తొలగించిన సెన్సార్ బోర్డు
- నిహలానీ వంటి నిర్మాతలు నష్టపోవాల్సి వస్తోంది
- తొమ్మిదేళ్లుగా కొందరు వివక్ష చూపుతున్నారు
- మంచి రివ్యూలు రావడాన్ని సహించలేకపోతున్నారు
గత తొమ్మిదేళ్లుగా కొందరు తనపై వివక్ష చూపుతున్నారని ఈ సందర్భంగా గోవింద అన్నారు. తాను ప్రధాన పాత్రలో నటించిన సినిమాలేవీ విడుదలకు నోచుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీని కారణంగా నిహలానీ వంటి నిర్మాతలు చాలా నష్టపోవాల్సి వస్తోందని ఆయన తెలిపారు. తన చిత్రాలకు మంచి రివ్యూలు రావడాన్ని కొందరు సహించలేకపోతున్నారని ఆరోపించారు. ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ చిత్రానికి సర్టిఫికేట్ ఇచ్చిన సీబీఎఫ్సీ ఛైర్మన్ ప్రసూన్ జోషి తన చిత్రానికి ఇవ్వలేకపోయారన్నారు. దీనిపై తాము విమర్శించేసరికి గైడ్లైన్స్ పుస్తకం చూడకుండానే తన చిత్రం నుంచి 20 సన్నివేశాలను తొలగించారని గోవింద ఆవేదన వ్యక్తం చేశారు.