అద్భుత ఇన్నింగ్స్... టీ-20లో డబుల్ సెంచరీ!
- దుబాయ్ లో టీ-20 పోటీలు
- 208 పరుగులు చేసిన హరికృష్ణ
- ఐపీఎల్ ఆడటమే లక్ష్యమన్న యువ ఆటగాడు
78 బంతులాడిన హరికృష్ణ, 22 ఫోర్లు, 14 సిక్సర్లతో 208 పరుగులు సాధించాడు. 172 పరుగులు బౌండరీల రూపంలోనే వచ్చాయి. దీంతో ఆ జట్టు 251 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచింది. అయితే, ఈ భారీ లక్ష్యాన్ని సైతం మెకోస్ జట్టు 17 ఓవర్లలోనే ఛేదించగా, హరికృష్ణను మ్యాన్ ఆధ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
మ్యాచ్ అనంతరం హరికృష్ణ మాట్లాడుతూ, ఇండియాలో జరిగే ఐపీఎల్ లో ఆడటమే తన లక్ష్యమని చెప్పాడు. కాగా, అంతర్జాతీయ టీ-20 పోటీల్లో ఇంతవరకూ డబుల్ సెంచరీ నమోదు కాలేదు. 2013లో జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ చేసిన 175 (నాటౌట్) పరుగులే అత్యధిక స్కోరు.