భారత్-వెస్టిండీస్ మూడో వన్డే.. రెండో వికెట్ కోల్పోయిన కరేబియన్ జట్టు!
- చావుదెబ్బ తీసిన బుమ్రా
- తొలి స్పెల్ లోనే రెండు వికెట్లు
- పోరాడుతున్న విండీస్ జట్టు
పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మూడో వన్డే జరుగుతోంది. ఈ సిరీస్ భాగంగా ఇప్పటివరకూ జరిగిన రెండు మ్యాచుల్లో భారత్ ఓసారి గెలుపొందగా, రెండోది టైగా ముగిసింది. దీంతో ప్రస్తుతం ఈ వన్డే సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంతో ఉంది. ఈ మ్యాచ్ లో భువనేశ్వర్ కుమార్, బుమ్రాలకు చోటు కల్పించిన సెలెక్టర్లు, ఉమేశ్ యాదవ్, రవీంద్ర జడేజాకు విశ్రాంతి ఇచ్చారు.
భారత జట్టు: విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, అంబటి రాయుడు, ధోని, రిషబ్ పంత్, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, బూమ్రా, ఖలీల్ అహ్మద్, చాహల్
వెస్టిండీస్ జట్టు: కీరన్ పావెల్, చంద్రపాల్ హేమరాజ్, సాయ్ హోప్, మార్లోన్ శామ్యూల్స్, హెట్మెయిర్, రోవ్మాన్ పావెల్, జాసన్ హోల్డర్, ఫాబియన్ అలెన్, అశ్లే నర్స్, కీమర్ రోచ్, మెక్కాయ్