devineni: ‘పోలవరం’ ను ఆపాలని రాజశేఖర్ రెడ్డి ఆత్మ, జగన్ ప్రయత్నిస్తున్నారు : మంత్రి దేవినేని
పోలవరం ప్రాజెక్టును ఆపాలని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ, ఆయన తనయుడు జగన్ ప్రయత్నిస్తున్నారంటూ ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మే చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తవుతుందని అన్నారు. అవుకు టన్నెల్ పూర్తయితే పులివెందులకు నీళ్లు వస్తాయని జగన్ భయపడుతుంటే, వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కాకూడదని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తాపత్రయ పడుతున్నారని విమర్శించారు.