rangastalam: వైజాగ్ బీచ్ రోడ్డులో ఈ నెల 18న రంగస్థలం ప్రీ రిలీజ్ వేడుక

లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నటించిన ‘రంగస్థలం’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను వైజాగ్ బీచ్ లో నిర్వహించాలని నిర్ణయించినట్టు అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయుడు, వైజాగ్‌ చిరంజీవి యువత అధ్యక్షుడు పీతల గోవింద్‌ తెలిపారు. వైజాగ్ లోని ఒక హోటల్ లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ, ఈ నెల 18న బీచ్ ఒడ్డున  ‘రంగస్థలం’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్టు తెలిపారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరవుతారని వారు తెలిపారు. 18వ తేదీ సాయంత్రం 6 గంటలకు వేడుక ఆరంభమవుతుందని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ‘రంగస్థలం’లో నటించిన నటీనటులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా పాల్గొంటారని వారు తెలిపారు. మెగా అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రీరిలీజ్ ఈవెంట్ ను విజయవంతం చెయ్యాలని వారు పిలుపునిచ్చారు.
rangastalam
Ramcharan
sukumar
samantha
movie

More Telugu News