చంద్రబాబుకు అమిత్ షా ఫోన్‌.. విభజన సమస్యలపై చర్చిద్దామన్న బీజేపీ అధ్యక్షుడు!

  • కేంద్ర ప్రభుత్వంపై పోరాడతామని ఈ రోజు మరోసారి స్పష్టం చేసిన టీడీపీ
  • విభజన హామీలపై చర్చిద్దామని ఫోన్‌లో చెప్పిన అమిత్ షా
  • ఈ నెల 5న కేంద్ర మంత్రులతో చర్చించనున్న సుజనా చౌదరి బృందం
ఈ రోజు అమరావతిలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. మరో మూడు రోజుల్లో బడ్జెట్ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సమావేశం జరిపి, ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయానికి నిరసనగా పార్లమెంటు సమావేశాల్లో పెద్ద ఎత్తున నిరసన తెలపాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఫోన్ చేశారు. విభజన సమస్యలపై చర్చిద్దామని అమిత్ షా అన్నారు. దీంతో ఈ నెల 5న తాము కేంద్ర మంత్రి సుజనా చౌదరి బృందాన్ని చర్చలకు పంపుతామని చంద్రబాబు నాయుడు చెప్పారు. హామీల సాధన విషయంలో తాము రాజీపడబోమని అమిత్ షాకు చంద్రబాబు తెలిపారు. తాము ప్రజల డిమాండ్ కోసమే పోరాడుతున్నామని స్పష్టం చేశారు.      
Go Back to Shorts
Chandrababu
amith shaw
Andhra Pradesh

More Telugu News