Nayanatara: దొంగను పట్టించిన నయనతార ఫొటో... బీహార్ పోలీసుల వలపు వల ఫలించిన వైనం!

షార్ట్స్‌లో చూడండి
బీహర్లో దొంగతనానికి గురైన ఓ నేత సెల్ ఫోన్ ను వెతికి పట్టుకునేందుకు పోలీసులు వినూత్న ప్లాన్ వేసి సక్సెస్ అయ్యారు. దక్షిణాదిన హీరోయిన్ గా వెలుగుతున్న నయనతార ఫొటోను వారు వాడుకుని దొంగను పట్టుకున్నారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, దర్భంగాలో సంజయ్ కుమార్ అనే బీజేపీ నేత మొబైల్ ఫోన్ ను మొహమ్మద్ హసైన్ అనే దొంగ తీసుకెళ్లాడు. సంజయ్ ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించిన పోలీసులు, దొంగ అదే సిమ్ ను వాడుకుంటున్నాడని తెలుసుకున్నారు.

ఆపై అతనిపై ఏఎస్ఐగా పనిచేస్తున్న మధుబాలాదేవితో వలపు వల విసిరేయించారు. తొలుత తనకు పోలీసులే ఫోన్ చేస్తున్నారని హసైన్ భయపడ్డా, నాలుగైదు రోజుల పాటు ఆమె తియ్యని మాటలు చెప్పడంతో పడిపోయాడు. కలవాలని ఉందని చెబితే, అప్పటికే వలపు మత్తులో మునిగిన హసైన్, ఫొటో పంపించాలని కోరాడు. దీంతో మధుబాల వెతికి వెతికి మరీ నయనతార ఫొటోను ఎంపిక చేసి పంపించింది. ఆపై వెంటనే ఫ్లాట్ అయిపోయిన హసైన్, ఆమె చెప్పిన చోటికి, చెప్పిన టైమ్ కు వచ్చేశాడు. అప్పటికే అక్కడ సివిల్ దుస్తుల్లో మకాం వేసిన పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఆ విధంగా నయనతార దొంగను పట్టించినట్లయింది.
Go Back to Shorts
Nayanatara
Thief
Bihar
Police

More Telugu News