దుమ్ము దులిపేసిన టీమిండియా బ్యాట్స్మెన్.. టీ20లో అతి భారీ స్కోరు!
- నిర్ణీత ఓవర్లలో టీమిండియా స్కోరు 260/5
- రోహిత్ శర్మ 118 (43 బంతుల్లో) పరుగులు
- లోకేశ్ రాహుల్ 49 బంతుల్లో 89 పరుగులు
- టీ20 చరిత్రలో భారత్కు ఇదే అత్యధిక స్కోరు
కొద్ది సేపటికే మరో ఓపెనర్ లోకేశ్ రాహుల్ 35 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. లోకేశ్ రాహుల్ అదే ఆటతీరును కొనసాగిస్తూ 49 బంతుల్లో 89 పరుగులు చేసి నువాన్ ప్రదీప్ బౌలింగ్లో ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా 3 బంతులు ఆడి 10 పరుగులు బాది.. ప్రదీప్ బౌలింగ్లోనే క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు. క్రీజులో రాణించిన ధోనీ 21 బంతుల్లో 28 పరుగులు చేశాడు. శ్రేయాస్ అయ్యర్ డకౌట్గా వెనుదిరిగాడు. మనీశ్ పాండే 1 పరుగు, దినేశ్ కార్తీక్ 5 పరుగులు చేశారు.
టీమిండియాకి ఎక్స్ ట్రాల రూపంలో 9 పరుగులు వచ్చాయి. దీంతో టీమిండియా 20 ఓవర్లకి 260 పరుగులు చేసింది. టీ20 చరిత్రలో భారత్కు ఇదే అత్యధిక స్కోరు. టీ20ల్లో రెండో అత్యధిక స్కోరును భారత్ సమం చేసింది. శ్రీలంక బౌలర్లలో ప్రదీప్, పెరీరాలకు రెండేసి చొప్పున వికెట్లు లభించగా, చమీరాకి ఒక వికెట్ దక్కింది.