కథానాయికగా రితికా సింగ్ మరో ఛాన్స్ కొట్టేసింది!
- హరి దర్శకత్వంలో ఆది పినిశెట్టి
- కొంత గ్యాప్ తరువాత హీరోగా
- కథానాయికలుగా తాప్సీ .. రితికా సింగ్
ఆది పినిశెట్టి కథానాయకుడిగా ఒక సినిమాను తెరకెక్కించడానికి హరి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికల అవసరం వుంటుందట. దాంతో ఒక కథానాయికగా తాప్సీని తీసుకున్నారు. మరో కథానాయిక పాత్ర కోసం కొంతమంది పేర్లను పరిశీలించి, చివరికి రితికా సింగ్ ను ఎంపిక చేశారట. కోన వెంకట్ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాలో, ఆది పినిశెట్టి అంధుడిగా నటించనుండటం విశేషం.