రెండు రికార్డులు సొంతం చేసుకున్న కోహ్లీ... మురళీ విజయ్ 150
- ఏడాదిలో ఒకే జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన కెప్టెన్ గా కోహ్లీ
- ఒకే ఏడాది అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్ గా
- 150 పరుగులు చేసిన మురళీ విజయ్
ఈ టెస్టులో విజయం సాధించడం ద్వారా టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టు రికార్డును బద్దలు చేయాలని కోహ్లీ సేన బలంగా భావిస్తోంది. ఈ నేపథ్యంలో వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలని భావిస్తోంది. లంకేయులు కోహ్లీపై దృష్టి కేంద్రీకరించడంతో మురళీ విజయ్ తనపని తాను చేసుకుపోతున్నాడు. ఈ క్రమంలో మురళీ విజయ్ 150 పరుగుల మైలు రాయిని దాటాడు. దీంతో వీరిద్దరూ మూడో వికెట్ కు 250 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. దీంతో 81.4 ఓవర్లు ఆడిన టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది.