ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గరిష్ఠ వయోపరిమితి పెంపు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలకు పెరిగిన వయోపరిమితి
- నాన్-యూనిఫాం పోస్టులకు 34 నుంచి 44 ఏళ్లకు పెంపు
- 2027 సెప్టెంబర్ 30 వరకు నోటిఫికేషన్లకు వర్తించనున్న సడలింపు
- పోలీస్, ఫారెస్ట్ వంటి యూనిఫాం పోస్టులకు వర్తించని ఈ పెంపు
- రిజర్వేషన్ కేటగిరీల వయోపరిమితి సడలింపులు యథాతథం
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వయోపరిమితి పెంపుపై చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నాన్-యూనిఫాం ప్రభుత్వ ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాలకు గరిష్ఠ వయోపరిమితిని 10 సంవత్సరాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో ఇప్పటివరకు 34 ఏళ్లుగా ఉన్న గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లకు పెరిగింది. ఏపీపీఎస్సీతో పాటు ఇతర ప్రభుత్వ సంస్థలు చేపట్టే నియామకాలకు ఈ పెంపు వర్తిస్తుంది.
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఈ పదేళ్ల అదనపు వయోపరిమితి సడలింపు 2027 సెప్టెంబర్ 30వ తేదీ వరకు విడుదల చేసే ఉద్యోగ నోటిఫికేషన్లకు మాత్రమే అమల్లో ఉంటుంది. అంటే.. దాదాపు ఏడాది పాటు చేపట్టే నాన్-యూనిఫాం పోస్టుల భర్తీకి ఈ అవకాశం అందుబాటులో ఉండనుంది. అయితే, యూనిఫాం సర్వీసులకు మాత్రం సాధారణ కేటగిరీలో కేవలం రెండేళ్ల పాటు వయోపరిమితిని పెంచినట్లు ప్రభుత్వం పేర్కొంది.
ఇప్పటికే 'ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్-1996' ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వంటి రిజర్వేషన్ కేటగిరీలకు ప్రస్తుతం అమలులో ఉన్న వయోపరిమితి సడలింపులు యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే.. పెంచిన 44 ఏళ్ల గరిష్ఠ పరిమితికి అదనంగా ఈ వర్గాలకు రిజర్వేషన్ల ప్రకారం మరో ఐదేళ్ల సడలింపు వర్తిస్తుంది.
అయితే, ఈ వయోపరిమితి పెంపు అన్ని ఉద్యోగాలకు వర్తించదని ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. పోలీస్, ఎక్సైజ్, ఫైర్, జైళ్లు, అటవీ, రవాణా శాఖలకు చెందిన యూనిఫాం పోస్టులకు, నిర్దిష్ఠ భౌతిక ప్రమాణాలు తప్పనిసరి అయిన ఉద్యోగాలకు ఈ 10 ఏళ్ల సడలింపు వర్తించదు. అభ్యర్థులు ఆయా ఉద్యోగ ప్రకటనలలో పేర్కొన్న నిబంధనలను జాగ్రత్తగా పరిశీలించాలని అధికారులు సూచించారు.
గత కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడంతో వయసు మీరుతోందని ఆందోళన చెందుతున్న నిరుద్యోగ యువత, వయోపరిమితిని పెంచాలని సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్లకు పలు సందర్భాల్లో విజ్ఞప్తి చేశారు.
వారి అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, అధికారులతో చర్చించి ఈ సానుకూల నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో నిరుద్యోగ యువతలో హర్షం వ్యక్తమవుతోంది. తమ విన్నపాన్ని మన్నించినందుకు వారు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
దీంతో ఇప్పటివరకు 34 ఏళ్లుగా ఉన్న గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లకు పెరిగింది. ఏపీపీఎస్సీతో పాటు ఇతర ప్రభుత్వ సంస్థలు చేపట్టే నియామకాలకు ఈ పెంపు వర్తిస్తుంది.
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఈ పదేళ్ల అదనపు వయోపరిమితి సడలింపు 2027 సెప్టెంబర్ 30వ తేదీ వరకు విడుదల చేసే ఉద్యోగ నోటిఫికేషన్లకు మాత్రమే అమల్లో ఉంటుంది. అంటే.. దాదాపు ఏడాది పాటు చేపట్టే నాన్-యూనిఫాం పోస్టుల భర్తీకి ఈ అవకాశం అందుబాటులో ఉండనుంది. అయితే, యూనిఫాం సర్వీసులకు మాత్రం సాధారణ కేటగిరీలో కేవలం రెండేళ్ల పాటు వయోపరిమితిని పెంచినట్లు ప్రభుత్వం పేర్కొంది.
ఇప్పటికే 'ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్-1996' ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వంటి రిజర్వేషన్ కేటగిరీలకు ప్రస్తుతం అమలులో ఉన్న వయోపరిమితి సడలింపులు యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే.. పెంచిన 44 ఏళ్ల గరిష్ఠ పరిమితికి అదనంగా ఈ వర్గాలకు రిజర్వేషన్ల ప్రకారం మరో ఐదేళ్ల సడలింపు వర్తిస్తుంది.
అయితే, ఈ వయోపరిమితి పెంపు అన్ని ఉద్యోగాలకు వర్తించదని ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. పోలీస్, ఎక్సైజ్, ఫైర్, జైళ్లు, అటవీ, రవాణా శాఖలకు చెందిన యూనిఫాం పోస్టులకు, నిర్దిష్ఠ భౌతిక ప్రమాణాలు తప్పనిసరి అయిన ఉద్యోగాలకు ఈ 10 ఏళ్ల సడలింపు వర్తించదు. అభ్యర్థులు ఆయా ఉద్యోగ ప్రకటనలలో పేర్కొన్న నిబంధనలను జాగ్రత్తగా పరిశీలించాలని అధికారులు సూచించారు.
గత కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడంతో వయసు మీరుతోందని ఆందోళన చెందుతున్న నిరుద్యోగ యువత, వయోపరిమితిని పెంచాలని సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్లకు పలు సందర్భాల్లో విజ్ఞప్తి చేశారు.
వారి అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, అధికారులతో చర్చించి ఈ సానుకూల నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో నిరుద్యోగ యువతలో హర్షం వ్యక్తమవుతోంది. తమ విన్నపాన్ని మన్నించినందుకు వారు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.