ప్రజల అంచనాలకు తగ్గట్టు కలెక్టర్లు మారాలి.. టెక్నాలజీ, ఏఐ వాడకం తప్పనిసరి: సీఎం చంద్రబాబు
- 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
- కొత్త తరం నాయకత్వ పద్ధతులు అలవర్చుకోవాలని కలెక్టర్లకు సూచన
- పరిపాలనలో ఏఐ, టెక్నాలజీ వినియోగంతో కచ్చితమైన ఫలితాలు సాధించాలని నిర్దేశం
- అధికారులు, నేతలకు విశ్వసనీయతే అత్యంత ప్రధానం అన్న సీఎం
- ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆలోచనా విధానం మార్చుకోవాలని పిలుపు
ప్రజల ఆశలు, అంచనాలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని, కొత్త తరం నాయకత్వ పద్ధతులను (న్యూ ఏజ్ లీడర్షిప్) అలవర్చుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. పరిపాలనలో టెక్నాలజీని అందిపుచ్చుకుని, వేగవంతమైన ఫలితాలు సాధించడంపై దృష్టి పెట్టాలని ఆయన స్పష్టం చేశారు. గురువారం అమరావతిలో జరిగిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో "లీడర్షిప్ - న్యూ ఏజ్ గవర్నెన్స్" అనే అంశంపై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, "గతంలో అనేక అంశాలపై దృష్టి సారించినా, ఇప్పుడు ప్రధానంగా నాయకత్వంపైనే ఆలోచించాలని నిర్ణయించాం. సరైన నాయకత్వంతోనే వేగంగా ఫలితాలు సాధించి, స్వర్ణాంధ్ర విజన్ లక్ష్యాలను చేరుకోగలం. నాయకత్వం అనేది స్వీయ ప్రేరణ. ఈ విషయంలో మహిళలు, పురుషులు అనే వ్యత్యాసం చూడటం పాత కాలపు పద్ధతి" అని అన్నారు. ప్రస్తుతం నాయకత్వ మార్పు దశలో ఉన్నామని, అందరూ కొత్త నాయకత్వ పంథాను అనుసరించాలని సూచించారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా ఉద్యోగ వ్యవస్థలు కూడా రూపాంతరం చెందుతున్నాయని, ఈ క్రమంలో అధికారులు, రాజకీయ నేతలకు విశ్వసనీయతే అత్యంత కీలకమని చంద్రబాబు నొక్కిచెప్పారు. నైపుణ్యాలకు నిరంతరం పదును పెట్టుకోవడం ద్వారానే వృత్తిలో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని వివరించారు.
టెక్నాలజీ ప్రాధాన్యాన్ని వివరిస్తూ, "నేర్చుకోవడం అనేది నిరంతర ప్రక్రియగా మారాలి. ఆన్లైన్లో ఫైళ్ల నిర్వహణ, అవేర్, డేటా లేక్ వంటి సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా డేటాను విశ్లేషించుకుని, ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా కచ్చితమైన ఫలితాలు సాధించడంపై దృష్టి పెట్టాలి" అని ఆదేశించారు.
ప్రపంచవ్యాప్తంగా భారతీయ పారిశ్రామికవేత్తలు అత్యుత్తమంగా రాణిస్తున్నారని, ఏ వ్యవస్థలోనైనా ఇమిడిపోయే తత్వం భారతీయుల సొంతమని, ఆ స్ఫూర్తితో అధికారులు పనిచేయాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, "గతంలో అనేక అంశాలపై దృష్టి సారించినా, ఇప్పుడు ప్రధానంగా నాయకత్వంపైనే ఆలోచించాలని నిర్ణయించాం. సరైన నాయకత్వంతోనే వేగంగా ఫలితాలు సాధించి, స్వర్ణాంధ్ర విజన్ లక్ష్యాలను చేరుకోగలం. నాయకత్వం అనేది స్వీయ ప్రేరణ. ఈ విషయంలో మహిళలు, పురుషులు అనే వ్యత్యాసం చూడటం పాత కాలపు పద్ధతి" అని అన్నారు. ప్రస్తుతం నాయకత్వ మార్పు దశలో ఉన్నామని, అందరూ కొత్త నాయకత్వ పంథాను అనుసరించాలని సూచించారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా ఉద్యోగ వ్యవస్థలు కూడా రూపాంతరం చెందుతున్నాయని, ఈ క్రమంలో అధికారులు, రాజకీయ నేతలకు విశ్వసనీయతే అత్యంత కీలకమని చంద్రబాబు నొక్కిచెప్పారు. నైపుణ్యాలకు నిరంతరం పదును పెట్టుకోవడం ద్వారానే వృత్తిలో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని వివరించారు.
టెక్నాలజీ ప్రాధాన్యాన్ని వివరిస్తూ, "నేర్చుకోవడం అనేది నిరంతర ప్రక్రియగా మారాలి. ఆన్లైన్లో ఫైళ్ల నిర్వహణ, అవేర్, డేటా లేక్ వంటి సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా డేటాను విశ్లేషించుకుని, ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా కచ్చితమైన ఫలితాలు సాధించడంపై దృష్టి పెట్టాలి" అని ఆదేశించారు.
ప్రపంచవ్యాప్తంగా భారతీయ పారిశ్రామికవేత్తలు అత్యుత్తమంగా రాణిస్తున్నారని, ఏ వ్యవస్థలోనైనా ఇమిడిపోయే తత్వం భారతీయుల సొంతమని, ఆ స్ఫూర్తితో అధికారులు పనిచేయాలని ఆకాంక్షించారు.