కాకినాడ జిల్లాలో పులి సంచారం.. రంగంలోకి దిగిన పవన్ కల్యాణ్
- కాకినాడ జిల్లాలో పులి సంచారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష
- పులి కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని అధికారులకు ఆదేశం
- అటవీ, పోలీస్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచన
- ప్రజల భద్రతతో పాటు పులికి హాని జరగకుండా చూడాలని స్పష్టీకరణ
కాకినాడ జిల్లాలో పులి సంచారం స్థానికంగా ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రత్తిపాడు మండలం ధారపల్లి సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో పులి తిరుగుతున్న సమాచారంతో ఆయన అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పులి కదలికలు, ప్రస్తుత పరిస్థితి, దానిని పట్టుకునేందుకు అటవీ శాఖ తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు.
పులి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు అటవీ శాఖ, ప్రత్యేక 'హనుమాన్' బృందాలు నిరంతర నిఘా కొనసాగించాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. పులి జనావాసాల్లోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో అటవీ, పోలీస్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాపిడ్ రెస్పాన్స్ బృందాలను సర్వసన్నద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తూ, వారికి భద్రతపై భరోసా కల్పించాలని అధికారులకు తెలిపారు. "ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అదే సమయంలో, పులికి ఎలాంటి హాని కలగకుండా చూడటం కూడా మన బాధ్యత" అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.
పులి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు అటవీ శాఖ, ప్రత్యేక 'హనుమాన్' బృందాలు నిరంతర నిఘా కొనసాగించాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. పులి జనావాసాల్లోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో అటవీ, పోలీస్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాపిడ్ రెస్పాన్స్ బృందాలను సర్వసన్నద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తూ, వారికి భద్రతపై భరోసా కల్పించాలని అధికారులకు తెలిపారు. "ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అదే సమయంలో, పులికి ఎలాంటి హాని కలగకుండా చూడటం కూడా మన బాధ్యత" అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.