పిల్లల ఆధార్ బయోమెట్రిక్పై కీలక ప్రకటన.. ఉచితం ఎప్పటివరకు అంటే..!
- పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్పై యూఐడీఏఐ కీలక ప్రకటన
- సెప్టెంబర్ 30 వరకు ఈ సేవలు పూర్తిగా ఉచితం
- 5, 15 ఏళ్లు నిండిన పిల్లలకు బయోమెట్రిక్స్ అప్ డేట్ తప్పనిసరి
- పాఠశాల అడ్మిషన్లు, ప్రభుత్వ పథకాలకు ఇది చాలా అవసరం
- వెంటనే దగ్గర్లోని ఆధార్ కేంద్రానికి వెళ్లాలని తల్లిదండ్రులకు సూచన
పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్పై భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) కీలక ప్రకటన చేసింది. 5 నుంచి 17 ఏళ్లలోపు పిల్లలకు సంబంధించిన తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ ప్రక్రియను సెప్టెంబర్ 30 వరకు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఈ గడువు సమీపిస్తున్నందున తల్లిదండ్రులు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది.
పిల్లలకు 5 సంవత్సరాలు, ఆ తర్వాత 15 సంవత్సరాలు నిండినప్పుడు వారి బయోమెట్రిక్ వివరాలను (వేలిముద్రలు, కనుపాప) తప్పనిసరిగా అప్డేట్ చేయించాల్సి ఉంటుంది. వయస పెరిగే కొద్దీ పిల్లల బయోమెట్రిక్స్లో మార్పులు వస్తాయి కాబట్టి, ఆధార్ రికార్డుల కచ్చితత్వం కోసం ఈ అప్డేట్ అనివార్యం. పాఠశాల ప్రవేశాలు, పరీక్షలు, ఉపకార వేతనాలు (స్కాలర్షిప్లు), ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
ఐదేళ్లలోపు పిల్లలకు ఆధార్ నమోదు చేసే సమయంలో కేవలం వారి ఫోటో, చిరునామా వంటి వివరాలను మాత్రమే సేకరిస్తారు. ఆ వయసులో వారి వేలిముద్రలు పూర్తిగా అభివృద్ధి చెందవు కాబట్టి బయోమెట్రిక్స్ను తీసుకోరు. కావున, ఆ పిల్లలకు ఐదేళ్లు నిండిన తర్వాత తొలిసారి, 15 ఏళ్లు నిండిన తర్వాత రెండోసారి బయోమెట్రిక్స్ను తప్పనిసరిగా అప్డేట్ చేయాలి. వాస్తవానికి, 2025 అక్టోబర్ 1 నుంచి ఏడాది పాటు ఈ సేవను యూఐడీఏఐ ఉచితంగా అందిస్తోంది. ప్రస్తుతం ఆ గడువు సెప్టెంబర్ 30తో ముగియనుండటంతో, చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే సమీపంలోని ఆధార్ కేంద్రాలను సంప్రదించాలని యూఐడీఏఐ తల్లిదండ్రులకు సూచించింది.
పిల్లలకు 5 సంవత్సరాలు, ఆ తర్వాత 15 సంవత్సరాలు నిండినప్పుడు వారి బయోమెట్రిక్ వివరాలను (వేలిముద్రలు, కనుపాప) తప్పనిసరిగా అప్డేట్ చేయించాల్సి ఉంటుంది. వయస పెరిగే కొద్దీ పిల్లల బయోమెట్రిక్స్లో మార్పులు వస్తాయి కాబట్టి, ఆధార్ రికార్డుల కచ్చితత్వం కోసం ఈ అప్డేట్ అనివార్యం. పాఠశాల ప్రవేశాలు, పరీక్షలు, ఉపకార వేతనాలు (స్కాలర్షిప్లు), ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
ఐదేళ్లలోపు పిల్లలకు ఆధార్ నమోదు చేసే సమయంలో కేవలం వారి ఫోటో, చిరునామా వంటి వివరాలను మాత్రమే సేకరిస్తారు. ఆ వయసులో వారి వేలిముద్రలు పూర్తిగా అభివృద్ధి చెందవు కాబట్టి బయోమెట్రిక్స్ను తీసుకోరు. కావున, ఆ పిల్లలకు ఐదేళ్లు నిండిన తర్వాత తొలిసారి, 15 ఏళ్లు నిండిన తర్వాత రెండోసారి బయోమెట్రిక్స్ను తప్పనిసరిగా అప్డేట్ చేయాలి. వాస్తవానికి, 2025 అక్టోబర్ 1 నుంచి ఏడాది పాటు ఈ సేవను యూఐడీఏఐ ఉచితంగా అందిస్తోంది. ప్రస్తుతం ఆ గడువు సెప్టెంబర్ 30తో ముగియనుండటంతో, చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే సమీపంలోని ఆధార్ కేంద్రాలను సంప్రదించాలని యూఐడీఏఐ తల్లిదండ్రులకు సూచించింది.