విద్యార్థుల ప్రశ్నలు-నారా లోకేశ్ జవాబులు.. గంటా శ్రీనివాసరావు సమాధానం హైలైట్!
- దివీస్ సహకారంతో ఆధునీకరించిన చంద్రంపాలెం స్కూల్ ప్రారంభం
- విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలిచ్చిన లోకేశ్
- సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు ... ఇదే తమ సిద్ధాంతమన్న మంత్రి
- మహిళల కోసం క్రీడల్లో 'షీ ప్లే' విధానం తీసుకొస్తామని వెల్లడి
- చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలని విద్యార్థులకు పిలుపు
"సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనేదే మా సిద్ధాంతం. రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దడమే లక్ష్యం" అని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. సమాజంలో మార్పు కోసం విద్యావంతులైన యువత రాజకీయాల్లోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా మధురవాడలోని చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ‘ప్రాజెక్ట్ చంద్రా’లో భాగంగా దివీస్ ల్యాబ్స్ సహకారంతో ఆధునీకరించారు. శనివారం ఈ పాఠశాలను మంత్రి లోకేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో ప్రత్యేకంగా ముఖాముఖి నిర్వహించి, వారి ప్రశ్నలకు స్ఫూర్తిదాయకంగా, ఆసక్తికరంగా సమాధానాలిచ్చారు.
పాఠశాలకు చేరుకున్న మంత్రి లోకేశ్ కు వేదపండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆధునికీకరించిన తరగతి గదులు, క్రీడా మైదానాలు, ఇతర మౌలిక వసతులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి సరదాగా కాసేపు వాలీబాల్ ఆడారు. పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మంత్రితో విద్యార్థుల ముఖాముఖి
సాధారణ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు భిన్నంగా మంత్రి లోకేశ్ విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన ఓపికగా సమాధానాలిచ్చారు.
విద్యార్థి ప్రశ్న: మీరు గతంలో చూసిన చంద్రంపాలెం పాఠశాలకు, ఇప్పటి పాఠశాలకు తేడా ఏంటి?
లోకేశ్: నేను గతంలో రెండుసార్లు ఈ స్కూల్కు వచ్చినా, రెండుసార్లూ వర్షం పడింది. అప్పుడు పరిసరాలు బురదమయంగా ఉండేవి. ఇప్పుడు దివీస్ ల్యాబ్స్ సహకారంతో పాఠశాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాల ఇలాగే అభివృద్ధి చెందాలన్నదే మా లక్ష్యం.
విద్యార్థి ప్రశ్న: మీకు ఇష్టమైన ఆట ఏంటి?
లోకేశ్: ప్రతి భారతీయుడిలాగే నాకు క్రికెట్ అంటే ఇష్టం. ప్రతీ ఆదివారం నా కుమారుడు దేవాన్ష్తో రెండు గంటలైనా క్రికెట్ ఆడతాను. అంతకుమించి సమయం ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు అవకాశం ఇవ్వడం లేదు (అని నవ్వుతూ అన్నారు).
విద్యార్థిని ప్రశ్న: క్రీడల్లో మహిళలకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి కదా?
లోకేశ్: ఇది నిజమే. మహిళలు క్రీడల్లోకి రావడానికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడం, సరైన వసతులు లేకపోవడం వంటి అడ్డంకులు ఉన్నాయి. అందుకే మహిళలను ప్రోత్సహించడానికి 'షీ ప్లే' అనే ప్రత్యేక విధానాన్ని తీసుకొస్తున్నాం. ప్రతిభకు అవకాశం ఇస్తే మహిళలు అద్భుతాలు సృష్టిస్తారు. మన తెలుగు క్రీడాకారిణి శ్రీచరణి మొదట క్రికెట్ ఆడతానంటే తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కానీ అవకాశం వచ్చాక ప్రపంచంలోనే ఉత్తమ బౌలర్గా ఎదిగింది.
విద్యార్థి ప్రశ్న: చిన్నప్పుడు తక్కువ మార్కులు వస్తే మీ తల్లిదండ్రులు ఎలా స్పందించేవారు?
లోకేశ్: నా చదువు విషయంలో మా అమ్మ చాలా క్రమశిక్షణతో ఉండేవారు. ఒకసారి రిపోర్ట్ కార్డులో నేనే సంతకం పెట్టి దొరికిపోయాను. తప్పుడు మార్గాల్లో వెళ్లకుండా నన్ను క్రమశిక్షణతో పెంచింది మా అమ్మే. నేను ఈ స్థాయికి రావడానికి ఆమే కారణం. నాన్నకు నా మార్కుల గురించి పట్టించుకునేంత సమయం ఉండేది కాదు.
విద్యార్థి ప్రశ్న: రాజకీయాల్లోకి రాకపోతే ఏం చేసేవారు?
లోకేశ్: 2005లో చంద్రబాబు గారు ఓడిపోయినప్పుడు ఆయనతో కలిసి ఒక పెళ్లికి వెళ్లాను. అక్కడ ఆయన రాగానే సుమారు 5 వేల మంది గౌరవంగా లేచి నిలబడ్డారు. ప్రజలు ఇచ్చే ఆ గౌరవాన్ని చూసి, అప్పుడే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాను.
విద్యార్థి ప్రశ్న: పదో తరగతి ఫలితాలపై విద్యార్థుల ఫొటోలతో ప్రకటనలు ఎందుకు ఇచ్చారు?
లోకేశ్: ప్రభుత్వ బడుల్లో చదివి ప్రతిభ చూపిన విద్యార్థుల ఫొటోలను పత్రికల్లో చూస్తారని అసెంబ్లీలో మాటిచ్చాను. ఆ మాట నిలబెట్టుకున్నాను. వారి కష్టాన్ని, ప్రతిభను ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే రాజకీయ నాయకుల ఫొటోలు లేకుండా ప్రకటనలు ఇచ్చాం.
విద్యార్థి ప్రశ్న: మీరు దేవుడిని నమ్ముతారా? మీకు ఇష్టమైన దేవుడు ఎవరు?
లోకేశ్: సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనేది మా సిద్ధాంతం. పేదరికం లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ సాయం చేయాలి. సాయం చేసే గుణం ఉన్నప్పుడే మీలో దేవుడు కనిపిస్తాడు.
విద్యార్థి ప్రశ్న: విద్యార్థి దశలో మీకు అత్యంత సంతోషాన్ని ఇచ్చిన విషయం?
లోకేశ్: భారీ వర్షాలు పడి పాఠశాలకు సెలవు ప్రకటిస్తే నాకు చాలా సంతోషంగా ఉండేది. కానీ ఇప్పుడు మీకు ఆ అవకాశం లేదు (అంటూ విద్యార్థులను నవ్వించారు).
విద్యార్థి ప్రశ్న: మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు?
లోకేశ్: అది సీక్రెట్ (అని సరదాగా అన్నారు). పాఠశాల, కళాశాల స్నేహాలను ఎప్పటికీ మర్చిపోవద్దు. తల్లిదండ్రుల తర్వాత మన భావాలను పంచుకునేది స్నేహితులతోనే.
అనంతరం మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. చదువుకున్న యువత సమాజంలో మార్పు తీసుకురావడానికి రాజకీయాల్లోకి రావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో దివీస్ ల్యాబ్ డైరెక్టర్ నీలిమ, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా విద్యార్థుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. పట్టుదలతో కష్టపడితే ఏదైనా సాధించవచ్చని నీలిమ విద్యార్థులకు సూచించారు.
విద్యార్థి ప్రశ్న: గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన మీరు, ప్రస్తుత మంత్రి లోకేశ్ గారికి ఏం సలహా ఇస్తారు?
ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు: (నవ్వుతూ) మా ఇద్దరికీ గొడవ పెట్టాలని చూస్తున్నావా? లోకేశ్ గారు ఒక విజనరీ లీడర్. ఆయన పాదయాత్ర చేయొద్దన్నా చేశారు, మంగళగిరిలో పోటీ చేయొద్దన్నా చేసి గెలిచారు. మేము ఐదేళ్లలో నేర్చుకున్నది ఆయన ఏడాదిలోనే నేర్చుకున్నారు. ఆయనకు ప్రత్యేకంగా సలహా అవసరం లేదు.
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. గంటా శ్రీనివాసరావు, నారాయణ వంటి అనుభవజ్ఞుల సూచనతోనే 10 వేల పాఠశాలల్లో 'వన్ క్లాస్-వన్ టీచర్' విధానాన్ని అమలు చేశామని తెలిపారు. పాఠశాల ఆధునికీకరణకు ముందుకు వచ్చిన దివీస్ ల్యాబ్స్ డైరెక్టర్ నీలిమకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, ఇతర అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.






పాఠశాలకు చేరుకున్న మంత్రి లోకేశ్ కు వేదపండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆధునికీకరించిన తరగతి గదులు, క్రీడా మైదానాలు, ఇతర మౌలిక వసతులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి సరదాగా కాసేపు వాలీబాల్ ఆడారు. పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మంత్రితో విద్యార్థుల ముఖాముఖి
సాధారణ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు భిన్నంగా మంత్రి లోకేశ్ విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన ఓపికగా సమాధానాలిచ్చారు.
విద్యార్థి ప్రశ్న: మీరు గతంలో చూసిన చంద్రంపాలెం పాఠశాలకు, ఇప్పటి పాఠశాలకు తేడా ఏంటి?
లోకేశ్: నేను గతంలో రెండుసార్లు ఈ స్కూల్కు వచ్చినా, రెండుసార్లూ వర్షం పడింది. అప్పుడు పరిసరాలు బురదమయంగా ఉండేవి. ఇప్పుడు దివీస్ ల్యాబ్స్ సహకారంతో పాఠశాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాల ఇలాగే అభివృద్ధి చెందాలన్నదే మా లక్ష్యం.
విద్యార్థి ప్రశ్న: మీకు ఇష్టమైన ఆట ఏంటి?
లోకేశ్: ప్రతి భారతీయుడిలాగే నాకు క్రికెట్ అంటే ఇష్టం. ప్రతీ ఆదివారం నా కుమారుడు దేవాన్ష్తో రెండు గంటలైనా క్రికెట్ ఆడతాను. అంతకుమించి సమయం ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు అవకాశం ఇవ్వడం లేదు (అని నవ్వుతూ అన్నారు).
విద్యార్థిని ప్రశ్న: క్రీడల్లో మహిళలకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి కదా?
లోకేశ్: ఇది నిజమే. మహిళలు క్రీడల్లోకి రావడానికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడం, సరైన వసతులు లేకపోవడం వంటి అడ్డంకులు ఉన్నాయి. అందుకే మహిళలను ప్రోత్సహించడానికి 'షీ ప్లే' అనే ప్రత్యేక విధానాన్ని తీసుకొస్తున్నాం. ప్రతిభకు అవకాశం ఇస్తే మహిళలు అద్భుతాలు సృష్టిస్తారు. మన తెలుగు క్రీడాకారిణి శ్రీచరణి మొదట క్రికెట్ ఆడతానంటే తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కానీ అవకాశం వచ్చాక ప్రపంచంలోనే ఉత్తమ బౌలర్గా ఎదిగింది.
విద్యార్థి ప్రశ్న: చిన్నప్పుడు తక్కువ మార్కులు వస్తే మీ తల్లిదండ్రులు ఎలా స్పందించేవారు?
లోకేశ్: నా చదువు విషయంలో మా అమ్మ చాలా క్రమశిక్షణతో ఉండేవారు. ఒకసారి రిపోర్ట్ కార్డులో నేనే సంతకం పెట్టి దొరికిపోయాను. తప్పుడు మార్గాల్లో వెళ్లకుండా నన్ను క్రమశిక్షణతో పెంచింది మా అమ్మే. నేను ఈ స్థాయికి రావడానికి ఆమే కారణం. నాన్నకు నా మార్కుల గురించి పట్టించుకునేంత సమయం ఉండేది కాదు.
విద్యార్థి ప్రశ్న: రాజకీయాల్లోకి రాకపోతే ఏం చేసేవారు?
లోకేశ్: 2005లో చంద్రబాబు గారు ఓడిపోయినప్పుడు ఆయనతో కలిసి ఒక పెళ్లికి వెళ్లాను. అక్కడ ఆయన రాగానే సుమారు 5 వేల మంది గౌరవంగా లేచి నిలబడ్డారు. ప్రజలు ఇచ్చే ఆ గౌరవాన్ని చూసి, అప్పుడే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాను.
విద్యార్థి ప్రశ్న: పదో తరగతి ఫలితాలపై విద్యార్థుల ఫొటోలతో ప్రకటనలు ఎందుకు ఇచ్చారు?
లోకేశ్: ప్రభుత్వ బడుల్లో చదివి ప్రతిభ చూపిన విద్యార్థుల ఫొటోలను పత్రికల్లో చూస్తారని అసెంబ్లీలో మాటిచ్చాను. ఆ మాట నిలబెట్టుకున్నాను. వారి కష్టాన్ని, ప్రతిభను ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే రాజకీయ నాయకుల ఫొటోలు లేకుండా ప్రకటనలు ఇచ్చాం.
విద్యార్థి ప్రశ్న: మీరు దేవుడిని నమ్ముతారా? మీకు ఇష్టమైన దేవుడు ఎవరు?
లోకేశ్: సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనేది మా సిద్ధాంతం. పేదరికం లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ సాయం చేయాలి. సాయం చేసే గుణం ఉన్నప్పుడే మీలో దేవుడు కనిపిస్తాడు.
విద్యార్థి ప్రశ్న: విద్యార్థి దశలో మీకు అత్యంత సంతోషాన్ని ఇచ్చిన విషయం?
లోకేశ్: భారీ వర్షాలు పడి పాఠశాలకు సెలవు ప్రకటిస్తే నాకు చాలా సంతోషంగా ఉండేది. కానీ ఇప్పుడు మీకు ఆ అవకాశం లేదు (అంటూ విద్యార్థులను నవ్వించారు).
విద్యార్థి ప్రశ్న: మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు?
లోకేశ్: అది సీక్రెట్ (అని సరదాగా అన్నారు). పాఠశాల, కళాశాల స్నేహాలను ఎప్పటికీ మర్చిపోవద్దు. తల్లిదండ్రుల తర్వాత మన భావాలను పంచుకునేది స్నేహితులతోనే.
అనంతరం మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. చదువుకున్న యువత సమాజంలో మార్పు తీసుకురావడానికి రాజకీయాల్లోకి రావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో దివీస్ ల్యాబ్ డైరెక్టర్ నీలిమ, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా విద్యార్థుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. పట్టుదలతో కష్టపడితే ఏదైనా సాధించవచ్చని నీలిమ విద్యార్థులకు సూచించారు.
విద్యార్థి ప్రశ్న: గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన మీరు, ప్రస్తుత మంత్రి లోకేశ్ గారికి ఏం సలహా ఇస్తారు?
ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు: (నవ్వుతూ) మా ఇద్దరికీ గొడవ పెట్టాలని చూస్తున్నావా? లోకేశ్ గారు ఒక విజనరీ లీడర్. ఆయన పాదయాత్ర చేయొద్దన్నా చేశారు, మంగళగిరిలో పోటీ చేయొద్దన్నా చేసి గెలిచారు. మేము ఐదేళ్లలో నేర్చుకున్నది ఆయన ఏడాదిలోనే నేర్చుకున్నారు. ఆయనకు ప్రత్యేకంగా సలహా అవసరం లేదు.
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. గంటా శ్రీనివాసరావు, నారాయణ వంటి అనుభవజ్ఞుల సూచనతోనే 10 వేల పాఠశాలల్లో 'వన్ క్లాస్-వన్ టీచర్' విధానాన్ని అమలు చేశామని తెలిపారు. పాఠశాల ఆధునికీకరణకు ముందుకు వచ్చిన దివీస్ ల్యాబ్స్ డైరెక్టర్ నీలిమకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, ఇతర అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.





