జెప్టోలో ఉచిత డెలివరీ కావాలా?.. ఇకపై మినిమమ్ ఆర్డర్ ఇంత ఉండాల్సిందే!
- జెప్టోలో పెరిగిన ఉచిత డెలివరీకి కనీస ఆర్డర్ విలువ
- సాధారణ సమయాల్లో రూ.149 నుంచి రూ.199కి పెంపు
- డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు రూ.299 వరకు పెంపు
- బ్లింకిట్, స్విగ్గీ ఇన్స్టామార్ట్ బాటలో జెప్టో నిర్ణయం
- లాభదాయకత పెంచుకునేందుకే డెలివరీ సంస్థల చర్యలు
క్విక్-కామర్స్ ప్లాట్ఫామ్ 'జెప్టో' తమ యూజర్లకు ఉచిత డెలివరీ అందించేందుకు అవసరమైన కనీస ఆర్డర్ విలువను పెంచింది. గతంలో రూ.149గా ఉన్న ఈ పరిమితిని సాధారణ సమయాల్లో 33.55% పెంచి రూ.199కి చేర్చింది. డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయాల్లో ఈ పరిమితి రూ.299 వరకు ఉంటుందని పలువురు కస్టమర్లు పేర్కొన్నారు. ఈ మార్పుతో జెప్టో తన పోటీ సంస్థలైన స్విగ్గీ ఇన్స్టామార్ట్, బ్లింకిట్ సరసన చేరింది.
ఆర్డర్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని మెరుగుపరచుకోవడం, డెలివరీ ఖర్చులను బ్యాలెన్స్ చేసుకోవడమే లక్ష్యంగా జెప్టో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త నిబంధనతో కస్టమర్లు తమ ఆర్డర్లలో మరిన్ని వస్తువులు చేర్చే అవకాశం ఉందని, తద్వారా 'సగటు ఆర్డర్ విలువ' (ఏఓవీ) పెరుగుతుందని కంపెనీ భావిస్తోంది. ఇది చిన్న ఆర్డర్లపై కంపెనీ మార్జిన్లను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
అయితే, ఈ పెంపు వినియోగదారులపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఒకటి రెండు వస్తువుల కోసం వేగంగా డెలివరీ కోరుకునే వారిని ఈ నిర్ణయం నిరుత్సాహపరిచే అవకాశం ఉంది. ఈ చర్య భారత క్విక్-కామర్స్ మార్కెట్లో పెరుగుతున్న పోటీని, లాభదాయకత కోసం కంపెనీలు అనుసరిస్తున్న వ్యూహాలను సూచిస్తోంది.
ఇటీవల జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ సంస్థలు కూడా తమ ప్లాట్ఫామ్ ఫీజులను పెంచిన విషయం తెలిసిందే. జొమాటో ఆర్డర్పై రూ.2.40, స్విగ్గీ రూ.2.59 వరకు పెంచాయి. మొత్తం మీద లాభదాయకతను పెంచుకుంటూనే కస్టమర్లను నిలుపుకునేందుకు ఆన్లైన్ డెలివరీ ప్లాట్ఫామ్లు డెలివరీ చార్జీలు, కనీస ఆర్డర్ విలువ వంటి అంశాలతో ప్రయోగాలు చేస్తున్నాయి.
ఆర్డర్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని మెరుగుపరచుకోవడం, డెలివరీ ఖర్చులను బ్యాలెన్స్ చేసుకోవడమే లక్ష్యంగా జెప్టో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త నిబంధనతో కస్టమర్లు తమ ఆర్డర్లలో మరిన్ని వస్తువులు చేర్చే అవకాశం ఉందని, తద్వారా 'సగటు ఆర్డర్ విలువ' (ఏఓవీ) పెరుగుతుందని కంపెనీ భావిస్తోంది. ఇది చిన్న ఆర్డర్లపై కంపెనీ మార్జిన్లను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
అయితే, ఈ పెంపు వినియోగదారులపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఒకటి రెండు వస్తువుల కోసం వేగంగా డెలివరీ కోరుకునే వారిని ఈ నిర్ణయం నిరుత్సాహపరిచే అవకాశం ఉంది. ఈ చర్య భారత క్విక్-కామర్స్ మార్కెట్లో పెరుగుతున్న పోటీని, లాభదాయకత కోసం కంపెనీలు అనుసరిస్తున్న వ్యూహాలను సూచిస్తోంది.
ఇటీవల జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ సంస్థలు కూడా తమ ప్లాట్ఫామ్ ఫీజులను పెంచిన విషయం తెలిసిందే. జొమాటో ఆర్డర్పై రూ.2.40, స్విగ్గీ రూ.2.59 వరకు పెంచాయి. మొత్తం మీద లాభదాయకతను పెంచుకుంటూనే కస్టమర్లను నిలుపుకునేందుకు ఆన్లైన్ డెలివరీ ప్లాట్ఫామ్లు డెలివరీ చార్జీలు, కనీస ఆర్డర్ విలువ వంటి అంశాలతో ప్రయోగాలు చేస్తున్నాయి.