ఆరేళ్ల తర్వాత బీజేపీ టీమ్‌లోకి రామ్ మాధవ్.. బలపడుతున్న సంఘ్ బంధం

Ram Madhav returns to BJP team after six years as Sangh ties strengthen
  • జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించిన కొత్త అధ్యక్షుడు నితిన్ నబిన్
  • 2020లో ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించిన తర్వాత ఇదే తొలి కీలక పదవి
  • కొత్త బృందంలో సునీల్ బన్సల్, బీఎల్ సంతోష్ వంటి ఆర్‌ఎస్‌ఎస్ నేతల కొనసాగింపు
  • రానున్న ఎన్నికలే లక్ష్యంగా పార్టీలో సంస్థాగత మార్పులు
బీజేపీ జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీనియర్ నేత రామ్ మాధవ్ దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత తిరిగి పార్టీ జాతీయ కార్యవర్గంలోకి ప్రవేశించారు. పార్టీ నూతన అధ్యక్షుడు నితిన్ నబిన్ ప్రకటించిన నూతన కార్యవర్గంలో రామ్ మాధవ్‌ను జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం ఉన్న పలువురు నేతలు ఈ కొత్త బృందంలోనూ తమ కీలక స్థానాలను నిలబెట్టుకోవడం గమనార్హం.

గతంలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌గా, జాతీయ అధికార ప్రతినిధిగా సేవలందించిన రామ్ మాధవ్, 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్‌లో పార్టీ బలోపేతానికి ఆయన విశేష కృషి చేశారు. కశ్మీర్‌లో బీజేపీ-పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటులో ఆయనది కీలక పాత్ర. అయితే, 2020లో జేపీ నడ్డా నేతృత్వంలోని కార్యవర్గంలో ఆయనకు స్థానం లభించలేదు. అప్పటి నుంచి ఆయన ఆర్‌ఎస్‌ఎస్ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా చురుగ్గా కొనసాగుతున్నారు.

తాజా నియామకం వెనుక ప్రధాని నరేంద్ర మోదీ చొరవ ఉన్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. సాధారణంగా ఉపాధ్యక్ష పదవి అలంకారప్రాయంగానే భావించినప్పటికీ, రామ్ మాధవ్‌కు మరిన్ని కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పార్టీ బలోపేతానికి ఆయన అనుభవాన్ని సంపూర్ణంగా వినియోగించుకోవాలని అధిష్ఠానం యోచిస్తోంది.
Advertisement
Ram Madhav
BJP National Vice President
RSS BJP relations
BJP National Executive
Narendra Modi

More Telugu News